ఏపీ ఉద్యోగుల జీతాల సవరణకు కొత్త పీఆర్‌సీ

  • పీఆర్‌సీ చైర్మన్‌గా డా. మన్మోహన్ సింగ్‌ను నియమిస్తూ జీవో జారీ 
  • ఏడాది లోపు నివేదిక ఇవ్వాలంటూ ఆదేశం
  • ప్రభుత్వం విధించిన కాలపరిమితిపై ఉద్యోగుల్లో అసంతృప్తి
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాల సవరణకు ప్రభుత్వం త్వరలో కొత్త పీఆర్‌సీ(12వ కమిటీ) తీసుకురానుంది. ఈ పే రివిజన్ కమిటీకి చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను నియమించింది. జీతాల సవరణపై సంవత్సరంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది. జీతభత్యాల విషయమై కమిటీ త్వరలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలతో చర్చించనుంది. 

కాగా, పీఆర్‌సీ నివేదిక సంవత్సరంలోగా ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.

Andhra Pradesh
YSRCP
YS Jagan
Government Employees

More Telugu News